- ఇద్దరు సీనియర్ డాక్టర్లతో కమిటీ
- 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కాన్పు కోసం అడ్మిట్అయిన గర్భిణికి కరోనా సోకిందని ట్రీట్మెంట్ చేసి రూ.29 లక్షలు వసూలు చేసిన యశోద హాస్పిటల్పై హైదరాబాద్ డీఎంహెచ్వో విచారణకు ఆదేశించారు. ఇద్దరు సీనియర్ డాక్టర్లతో మంగళవారం కమిటీ వేశారు. మలక్పేట యూచ్ఎన్సీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విజయ లక్ష్మి, శాలివాహన నగర్యూపీహెచ్సీ మెడికల్ఆఫీసర్డాక్టర్ పి. వీణను ఎంక్వైరీ కమిటీ సభ్యులుగా నియమించారు. మూడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బల్సూరుగొండకు చెందిన ఏసీటీవో శ్వేతారెడ్డి కాన్పు కోసం ఆగస్టు 4న యశోద ఆస్పత్రిలో చేరారు. ముందు రూ.2 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఆ తర్వాత రూ.29 లక్షల వరకు వసూలు చేసిన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈనెల 3న ఆమె చనిపోయారని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. ఈ ఘటనపై హైదరాబాద్ డీఎంహెచ్వోకు ఆలిండియా యాంటీ కరప్షన్ కమిటీ తెలంగాణ అధ్యక్షుడు ముజాహిద్ మోయిద్దీన్ఖాద్రీ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.