అయోధ్య రామాలయానికి అత్యధిక విరాళాలు.. ఇవే

అయోధ్య రామాలయానికి  అత్యధిక విరాళాలు.. ఇవే

ఎంతోమంది రామ భక్తులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన రామమందిరం కల ఈరోజు సాకారమైంది. ఎట్టకేలకు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.  అయోధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను జరుపుకున్నారు. అయితే ఈ రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది తమకు తోచినంత విరాళాలు అందించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా బిజినెస్‌మ్యాన్‌ల వరకు అందరూ ఇందులో భాగం పంచుకున్నారు. 

వజ్రాల వ్యాపారీ భారీగా విరాళం

 అత్యధికంగా రాములవారికి గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం భారీగా విరాళం అందించింది. సూరత్‌కు చెందిన దిలీప్‌ కుమార్ వి లాఖీ అనే వజ్రాల వ్యాపారి రాముడి కోసం ఏకంగా 101 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ బంగారాన్ని రాముని గుడి తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. 101 కేజీల బంగారం అంటే దిలీప్‌ కుమార్ కుంటుంబం రూ.68 కోట్ల విరాళం ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో అయితే ఓ వ్యక్తి రామమందిరం కోసం కోటీ రూపాయలు ఇవ్వాలనుకొని నిర్ణయించుకుని ఏకంగా 16 ఎకరాలు అమ్మేసినట్లు సమాచారం.ఇందుకు రూ.15 లక్షలు తక్కువ అయితే  అప్పు తెచ్చి ... అనుకున్నట్లుగా కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్‌ బాపు  ఈ ఆలయ నిర్మాణం కోసం రూ.11.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇదిలాఉండగా.. బ్రిటన్, కెనడా, అమెరికాలో  జీవనం సాగిస్తున్న భక్తులు రూ.8 కోట్లు విరాళం అందించారు.  దేశంలో 20 లక్షల మంది కార్యకర్తలు విరాళాల సేకరించారు. దాదాపు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు విరాళంగా వచ్చాయి.