- భైంసాలో రైతు ఆత్మహత్యాయత్నం
భైంసా, వెలుగు: ఫిర్యాదు చేస్తే పోలీసుల న్యాయం చేస్తలేరని, కనీసం పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు పోలీస్స్టేషన్ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్జిల్లా భైంసా మండలం కోతుల్ గాంకు చెందిన శైలజకు గ్రామంలో ఏడెకరాల భూమి ఉంది. ఆ భూమిని గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జా చేశాడంటూ రెండు నెలల క్రితం శైలజ భర్త మల్లేశ్(38)పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ వ్యక్తి సాగులో ఉన్న పత్తి పంటను ట్రాక్టర్తో దున్నుతుండగా మల్లేశ్అడ్డుకోగా అతనిపై దాడి చేశారు.
శనివారం భైంసారూరల్పీఎస్లో దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు తమకు న్యాయం చేయరని అంటూ పీఎస్ ఎదుటే మల్లేశ్ పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు, కుటుంబీకులు వెంటనే భైంసా ఏరియా హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్తీసుకెళ్లారు. తమకు పాస్బుక్ సైతం ఉందని, కానీ అధికారులు తమకు న్యాయం చేయడం లేదని శైలజ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. భైంసా రూరల్ఎస్సై శ్రీకాంత్మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.