వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని శ్రీవారికి వినతి పత్రం

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని శ్రీవారికి వినతి పత్రం

కరీంనగర్: సీఎం కేసీఆర్ మనసు మార్చాలని కోరుతూ సంపత్ వర్మ అనే వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశాడు. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆయన శ్రీవారిని వేడుకున్నాడు. కరీంనగర్ కు చెందిన వీఆర్ఏ సంపత్ వర్మ ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. స్వామివారికి తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినతి పత్రం ద్వారా వివరించాడు. రాష్ట్రంలో దాదాపు 23 వేల మంది వీఆర్ఏలు చాలి చాలని వేతనాలతో అవస్థలు పడుతున్నారని తెలిపాడు.

 

వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని రెండేళ్ల కిందట సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని, అయితే ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని చెప్పారు. 55 ఏళ్లు నిండిన వీఆర్ఏల స్థానంలో వాళ్ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని స్వామివారిని కోరినట్లు సంపత్ తెలిపాడు. అలాగే వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చే జీవో ను తక్షణమే రిలీజ్ చేసేలా చూడాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు చెప్పారు.