హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తి.. 5 తులాల బంగారం ఆర్డర్ పెడితే.. కొరియర్ లో ఖాళీ డబ్బా వచ్చింది. దీంతో బాధితుడు కన్జుమర్ఫోరమ్ను ఆశ్రయించాడు. కేసును విచారించిన ఫోరం, సంబంధిత వ్యాపార సంస్థపై కొరడా ఝలిపించింది. కన్జుమర్ కట్టిన డబ్బును ఏడాదికి 18 శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు మరో రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద ఇంకో రూ.10 వేలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఫోరం అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రవిచంద్ర ప్రైవేట్ ఎంప్లాయ్. హైదరాబాద్కు చెందిన షాపర్స్ స్టాప్ వెబ్సైట్లో 2016, డిసెంబర్ 12న ఐదు తులాల మలబార్ గోల్డ్ కొనుగోలు కోసం రూ.1,53,091 చెల్లించాడు. ఆర్డర్ చేసిన 7 పని దినాల్లోపు డెలివరీ అవుతుందని షాపర్స్ స్టాప్ నుంచి రవిచంద్రకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అదే నెల 22న అరామెక్స్ కొరియర్ నుంచి పార్శిల్ పంపుతున్నట్లు షాపర్స్ స్టాప్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. కానీ 26న రాత్రి 7.30 గంటలకు ఇ-కామ్ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్ నుంచి ఒక వ్యక్తి ట్రాకింగ్ నంబర్తో కూడిన ఒక ప్యాకెట్ను డెలివరీ చేశాడు. పార్శిల్ అందుకున్న రవిచంద్ర అనుమానంతో వీడియో తీస్తూ.. ప్యాకెట్ను తెరవగా ‘ఎం’ అనే అక్షరంతో ఉన్న చిన్న బాక్స్ ఉంది. దాన్ని తెరిచి చూస్తే.. ఇన్ వాయిస్ పేపర్లు మాత్రమే ఉన్నాయి. వెంటనే రవిచంద్ర, కస్టమర్ సపోర్ట్ సెంటర్కు సమాచారమిచ్చారు. పార్శిల్ ఫొటోలు అడగ్గా.. తాను తీసిన వీడియో పంపాడు. స్పందన రాకపోవడంతో సంబంధిత సంస్థకు రనోటీసులు పంపగా.. తమకు సంబంధం లేదని, కొరియర్ సంస్థ తప్పంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో బాధితుడు 2017లో ఫిబ్రవరి 15న హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం–1ను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఫోరం, బాధితుడు చెల్లించిన రూ.1,53,091ని ఆర్డర్ పెట్టిన తేదీ నుంచి ఏటా 18 శాతం వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశించింది. దీనిపై షాపర్స్ స్టాప్ యాజమాన్యం స్టేట్ కన్జుమర్ ఫోరానికి అప్పీల్కు వెళ్లగా.. కేసును విచారించి, జిల్లా ఫోరం తీర్పును సమర్థిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది
షాపర్స్ స్టాప్పై స్టేట్ కన్జుమర్ ఫోరం కొరడా
- హైదరాబాద్
- June 25, 2022
లేటెస్ట్
- వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు
- జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
- 1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
- సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...
- ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు..భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- V6 DIGITAL 18.05.2024 EVENING EDITION
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా