జ్ఞాపకాలను పదిలంగా ఉంచేది ఫొటో

జ్ఞాపకాలను పదిలంగా ఉంచేది ఫొటో

బషీర్​బాగ్​/గచ్చిబౌలి/ పద్మారావునగర్​, వెలుగు: జ్ఞాపకాలను పదిలంగా ఉంచేది ఫొటో మాత్రమేనని, ఫొటోను కళాత్మకంగా బంధించడం అంత సులభం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. వరల్డ్​ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మంగళవారం తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే ఆఫీసు ఆడిటోరియంలో ఫొటో ఎగ్జిబిషన్​ నిర్వహించారు. దీనిని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పొన్నం ప్రారంభించారు. ఫొటో కాంటెస్ట్ లో ప్రతిభ చాటిన వారిని అభినందించారు. 

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్​రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్​రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ డే సందర్భంగా హైదరాబాద్​ సెంటర్​ ఫర్​ ఫొటోగ్రఫీ అండ్​ ఆర్ట్​ గ్యాలరీ ఆధ్వర్యంలో మాదాపూర్​లోని చిత్రమయి స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలో  ఎగ్జిబిషన్​ నిర్వహించారు. యూత్​ అడ్వాన్స్​మెంట్​ టూరిజం, కల్చరల్​విభాగం ప్రత్యేక అధికారి జయేశ్​ రంజన్​ గెస్ట్​గా హాజరయ్యారు. పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు సంజీవ్​కుమార్​ పలువురు ఫొటో జర్నలిస్టులను సత్కరించారు.