డిసెంబర్ 15న 'కలశ' విడుదల

డిసెంబర్ 15న 'కలశ' విడుదల

భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌‌ ప్రధాన పాత్రల్లో కొండ రాంబాబు తెరకెక్కించిన చిత్రం ‘కలశ’.  డా. రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. ఈ నెల 15న సినిమా విడుదలవుతున్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన మురళీ మోహన్ మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు రాంబాబు తీసిన కొన్ని సీరియల్స్‌‌లో నేను నటించాను.

మంచి పర్‌‌ఫెక్షనిస్ట్‌‌. ఈ సినిమా సక్సెస్ సాధించి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా’ అన్నారు.  ఇలాంటి సైకలాజికల్‌‌ థ్రిల్లర్‌‌ తీయడం కత్తిమీద సాము లాంటిందని మరో అతిథి దర్శకుడు వీర శంకర్ అన్నారు. లవ్‌‌, రొమాన్స్, కామెడీ, సస్పెన్స్ లాంటి అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇదని హీరోహీరోయిన్స్ చెప్పారు. ‘పాజిటివ్‌‌ వైబ్రేషన్స్‌‌తో కూడిన సైకలాజికల్‌‌ థ్రిల్లర్‌‌ ఇది , ఇందులోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఇచ్చే చిత్రం అవుతుంది’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.