
ఖైరతాబాద్, వెలుగు: ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు తన ఇంటిని కబ్జా చేశారని ఓ పారిశుధ్య కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో నారాయణమ్మ మాట్లాడారు. గత 20 ఏండ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా సేవలందిస్తున్నానని తెలిపారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫిలింనగర్ లోనివినాయక నగర్లో ప్రభుత్వం తనకు కేటాయించిన 120 గజాల స్థలాన్ని దానం అనుచరులు కబ్జా చేసి, దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇంటిని ఖాళీ చేయించి, తన రేషన్కార్డును కూడా రద్దు చేశారన్నారు. దీనిపై ప్రజాభవన్లో ఫిర్యాదు చేస్తే, పోలీసు కమిషనర్కు సిఫార్సు చేశారన్నారు. కమిషనర్ డీసీపీ రాస్తే , డీసీపీ ఏసీపీకి, ఏసీపీ సీఐకు రాసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని నారాయణమ్మ కోరారు.