
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అన్వేషి’. వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ను సోమవారం నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. డిటెక్టివ్ కావాలనుకునే హీరో మారేడు కోనకు వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊరిలో ఆత్మలు ఉన్నాయనే పాయింట్తో ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించినట్టు టీజర్ ద్వారా అర్ధమవుతోంది. ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. సైమన్ కింగ్ బీజీఎం హైలైట్గా ఉంటుంది. మా బ్యానర్కు మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది’అన్నారు.