రెండోసారీ అమ్మాయి పుట్టిందని అమ్మేశారు

రెండోసారీ అమ్మాయి పుట్టిందని అమ్మేశారు

మెదక్(టేక్మాల్), వెలుగు: రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని గిరిజన దంపతులు అమ్మేశారు. ఈ విషయం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొల్లికుంట తండాలో సోమవారం వెలుగు చూసింది. అధికారులు, స్థానికుల వివరాల ప్రకారం మూడవత్ రేణుక, అశోక్ భార్యాభర్తలు. వీరికి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టగా, గతేడాది ఆగస్ట్15న మరో పాప పుట్టింది. రెండో బిడ్డను 3 రోజుల క్రితం చేవెళ్లకు చెందిన వ్యక్తులకు రూ.17 వేలకు ఇచ్చేశారు. విషయాన్ని స్థానిక అంగన్ వాడీ టీచర్ అల్లా దుర్గం సీడీపీఓ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్, ఆర్ఐ నా గరాజు, పోలీస్ సిబ్బంది, సీడీపీఓ భార్గవి తండాలో ఎంక్వైరీ చేశారు. రేణుక, అశోక్ అందుబాటులో లేకపోవడంతో పాప ఎక్కడుందనే విషయం తెలియలేదు.