మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్కు షాక్

మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్కు షాక్
  • నాతోపాటు ఇంకా చాలా మంది బయటకొస్తున్నారు
  • మూకుమ్మడి రాజీనామాలుంటాయి: చెరకు నరోత్తం రెడ్డి

మంచిర్యాల జిల్లా: అధికార టీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో మరో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అనుచరుడు చెరుకు నరోత్తం రెడ్డి పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన మండిపడ్డారు. ఆత్మగౌరవంతోనే టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు.

బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గానికి చేసిందమీ లేదని నరోత్త రెడ్డి విమర్శించారు. భీమారం మండలానికి ఇచ్చిన హామీలను సుమన్  విస్మరించారని చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొందరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నాతో పాటు చాలా మంది నేతలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నారని.. 3, 4 రోజుల్లో మూకుమ్మడి రాజీనామాలు ఉంటాయని నరోత్తం రెడ్డి తెలిపారు.