దొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ

దొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ

శ్రీకాకుళం జిల్లా: దేవాలయంలో దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు ఓ దొంగ. కిటికీలోంచి బయటపడేందుకు ప్రయత్నించి అందులోనే ఇరుక్కుపోయిన ఉదంతం తెల్లారాక బయటపడింది. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ దేవాలయంలో ఈ ఘటన జరిగిందీ. కంచిలికి చెందిన రీస్ పాపారావు అనే వ్యక్తి సోమవారం రాత్రి ఆలయంలోకి చొరబడి అమ్మవారి బంగారు, వెండి వస్తువులు దొంగిలించాడు. వాటన్నింటినీ మూటగట్టుకుని బయట పడే క్రమంలో కిటికీ కన్నంలో ఇరుక్కు పోయాడు. తెల్లారాక గ్రామస్తుల కంటపడ్డాడు. తనను ఎలాగైనా బయటకు తీసి కాపాడాలంటూ గ్రామస్తులను వేడుకున్నాడు. దొంగను కిటికీలో నుంచి బయటకు తీసిన స్థానికులు అతన్ని కంచిలి పోలీసులకు అప్పగించారు.

 

 

ఇవి కూడా చదవండి

డబల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం లేదని అర్ధరాత్రి ఏం చేశారంటే..

అజీమ్ ప్రేమ్జీ జీవితం అందరికీ ఆదర్శం

ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన

22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్

వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట