శిథిలావస్థలో సదాశివనగర్ మోడల్ ‌‌ స్కూల్ ‌‌ హాస్టల్ ‌‌

శిథిలావస్థలో సదాశివనగర్ మోడల్ ‌‌ స్కూల్ ‌‌ హాస్టల్ ‌‌
  •  విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా తెరువలె..!
  •     ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్లు
  •     పట్టించుకొని ఆఫీసర్లు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి  జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రం లో మోడల్ స్కూల్ ఉంది. స్కూల్ ‌‌తో పాటు జూనియర్ కాలేజీ కూడా ఉన్న ఇక్కడ మొత్తం 767 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో 267 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్లు​ ఉన్నారు. స్కూల్ ‌‌లో ఉన్నత విద్యను చదివే స్టూడెంట్స్​కోసం  రూ.కోటి 28 లక్షలతో హాస్టల్ బిల్డింగ్​నిర్మాణం చేశారు. 2015 లో ప్రారంభమైన హాస్టల్ ‌‌ ఈ బిల్డింగ్ ఏడేళ్లకే శిథిలావస్థకు చేరింది. మెయింటెనెన్స్ లేక కిచెన్​ అధ్వానంగా మారింది. కిచెన్ ‌‌తో పాటు రూమ్స్, బాత్​రూంల డోర్లు విరిగిపోయాయి. కరెంట్ ‌‌ వైర్లు కాలిపోవడం, స్విచ్ ‌‌ బోర్డులు ఊడిపోయి వేలాడుతున్నాయి. అయితే చిన్న చిన్న రిపేర్లు చేయిస్తూ ఏడాది పాటు నెట్టుకొచ్చారు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన విషయాన్ని  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొన్నా ళ్ల కింద కలెక్టర్ ​జితేష్ వి పాటిల్ కూడా పరిశీలించారు. రిపేర్​ చేయించేందుకు ప్రతిపాధనలు పంపాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో కొత్త  డోర్ల బిగింపు, బాత్​రూంలు, ఇతర  రిపేర్లు చేసేందుకు మొత్తం రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.  ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా శాంక్షన్​ కాలేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించాలని తల్లిదండ్రులు అంటున్నారు. 

నెలలు గడుస్తున్నా...

బిల్డింగ్​ శిథిలం కావడంతో ఈ సారి ఇంకా హాస్టల్​ఓపెన్ ‌‌ కాలేదు. ఇంటర్మీడియట్​క్లాస్ ‌‌లు షూరు అయి నెలలు గడుస్తున్నాయి. ఇంటర్​లో మొత్తం  267 మంది స్టూడెంట్లు ఉంటే ఇందులో గర్ల్స్ 199 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ ‌‌తో సదాశివనగర్​మండలంతో పాటు  రామారెడ్డి, గాంధారి, కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, మాచారెడ్డి మండలాలకు చెందిన గర్ల్స్​ కూడా చేరారు. రోజు బస్సులో వచ్చి వెళ్తున్నారు. కొన్ని  మండలాలకు చెందిన స్టూడెంట్లు రెండు బస్సులు మారి రావాల్సి వస్తోంది. హాస్టల్​వసతి ఉంటుందనే ఉద్దేశంతో కాలేజీలో చేర్పించారు. నెలలు గడుస్తున్నా హాస్టల్​ ఓపెన్​ చేయకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఫస్ట్​ ఇయర్ ‌‌ ‌‌లో చేరిన స్టూడెంట్లు హాస్టల్​ వసతి లేక వెళ్లిపోతున్నారు. 

ఆఫీసర్లు స్పందించాలి

మోడల్ ‌‌ స్కూల్ ‌‌లో హాస్టల్ ‌‌ ఉందనే ఇక్కడ పిల్లలను చేర్పించాం. కానీ హాస్టల్ బిల్డింగ్​రిపేర్ ‌‌ ‌‌లో ఉండడం తెరవడం లేదు. దీంతో పిల్లలు రోజూ బస్సులో వెళ్లి రావడం ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. 
- శ్రీనివాస్, స్టూడెంట్ తండ్రి