- చార్జ్షీట్లో లిక్కర్ క్వీన్ పేరు 28సార్లు ఉంది: రాజగోపాల్
- 28 సార్లయినా.. 28 వేల సార్లయినా అబద్ధం నిజం కాదు: కవిత
- స్కామ్పై ప్రజలకు వివరణ ఇవ్వాలన్న మాణిక్కం
- చార్జ్షీట్లో లిక్కర్ క్వీన్ పేరు 28సార్లు ఉంది: రాజగోపాల్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్పై బుధవారం నేతల మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు రావడంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మణిక్కం ఠాగూర్ ట్వీట్లు చేయగా.. ఇందుకు ఆమె స్పందించారు. లిక్కర్ స్కామ్లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మొదటిసారిగా వెలుగుచూసింది. తాజాగా సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్షీట్లోనూ ఆమె పేరు ఈడీ పేర్కొంది.
వివరణ ఇవ్వాలన్న మాణిక్కం.. అంతా అవాస్తవమన్న కవిత
లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న దానిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. దీనిపై కవిత స్పందిస్తూ.. తనపై నిందలు పూర్తిగా అవాస్తవమని, కాలమే తన నిబద్ధతను రుజువు చేస్తుందని రీ ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని.. పెట్టుబడిదారుల అనుకూల విధానాలు అమలు చేస్తున్న విషయాన్ని కేసీఆర్ ఎండగడుతుండటంతోనే బీజేపీ భయపడుతోందని ఆమె ఆరోపించారు.