మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని యువకుడు వినూత్న నిరసన

మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని యువకుడు వినూత్న నిరసన

మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ ఓ వార్డు మెంబర్ వినూత్న రీతిలో నిరసన తెలియజేశాడు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన తుపాకుల రవికుమార్ (3వ వార్డు సభ్యుడు) నిరసన తెలియజేశాడు. 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అధికారులను నిలదీశాడు. అయినా ఫలితం లేదు. చివరకు చేసేదేమీ లేక, అధికారుల తీరును తప్పుపడుతూ.. వినూత్నంగా నిరసన తెలియజేశాడు. 

15 రోజులుగా గ్రామంలోని పలు వార్డులకు నీళ్లు సరఫరా కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీళ్లను అందిస్తుంటే.. అధికారులు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వెంటనే వారు  సమాధానం చెప్పాలంటూ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుపైకి ఎక్కాడాడు. ట్యాంకు లోపలికి వెళ్లి నీళ్లల్లో నిరసన తెలియజేశాడు.