భారతదేశంలో క్రికెట్ ని ఎంతలా ఆరాధిస్తారో అందికీ తెలుసు. మ్యాచ్ టీవీల్లో వస్తుందంటేనే వదిలిపెట్టరు అలాంటిది.. ప్లేయర్లంతా తమ ఊరికి వచ్చి ఆడుతుంటే ఊరుకుంటారా..! ఊరంతా పండగ జరుపుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచే ప్లేయర్లకి స్వాగతం పలుకుతారు. అలాంటి ఘటనే రాయ్ పూర్లో జరిగింది. రేపు (జనవరి 21) న్యూజిలాండ్ తో జరగబోయే రెండవ వన్డేకోసం టీమిండియా రాయ్ పూర్ చేరుకుంది. దాంతో తమ అభిమాన క్రికెటర్లని చూసేందుకు ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ కి పోటెత్తారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్స్ కి వెళ్లే రోడ్లన్నీ ఫ్యాన్స్ తో సందడిగా కనిపించాయి.
ఎయిర్ పోర్ట్ సిబ్బంది శాలువాలు కప్పి ప్లేయర్లను ఆహ్వానించారు. తర్వాత ఛత్తీస్ గఢ్ ట్రెడిషనల్ డాన్స్ సూవా (Sua Dance), పంతీ (Panthi Dance) చేస్తూ వెల్ కం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియాను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇరు జట్ల మధ్య రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగనుంది.