ప్రాణహిత కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

ప్రాణహిత కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

కాగజ్ నగర్, వెలుగు: ప్రాణహిత కాలువలో దూకి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కౌటాల సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం బారెగూడెం గ్రామానికి చెందిన మురుమురే ఉమేశ్​(25) ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వెళ్లలేదు. సోమవారం మండలంలోని లంబడి గూడ సమీపంలో ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు కాలువలో ఓ డెడ్​బాడీ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో వెంటనే సీఐ సాదిక్ పాషా ఘటనా స్థలానికి చేరుకొని డెడ్​బాడీని బయటకు తీసి ఫొటోను సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో మృతుడు ఉమేశ్ గా గుర్తించారు. ఉమేశ్​ కొంతకాలంగా మానసిక స్థితి బాగాలేక తిరుగుతున్నాడని, ఈ క్రమంలోనే కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.