ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆది సాయికుమార్. వాటిలో ‘తీస్మార్ ఖాన్’ ఒకటి. కళ్యాణ్జీ గోగణ దర్శకత్వంలో నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ఆది స్టూడెంట్గా, రౌడీగా, పోలీస్గా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తాడు. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, కబీర్ సింగ్, పూర్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 19న విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్లో బిజీగా ఉంది టీమ్. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సాంగ్ రిలీజయ్యాయి. నిన్న రెండో పాటను వదిలారు. ‘సమయానికి తగు మాటాడవా’ అంటూ సాగే ఈ పాటలో ఆది, పాయల్ల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సాయి కార్తీక్ చేసిన ట్యూన్కి రాకేందు మౌళి లిరిక్స్ రాశాడు. శృతి పాడింది.