ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు

 ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు

న్యూఢిల్లీ:  ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేయనుందని సంబంధిత అధికారి తెలిపారు. ఏఏఐబీ డైరెక్టర్ జనరల్, ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌‌‌‌తో సహా ఒక బృందం అహ్మదాబాద్‌‌‌‌కు బయలుదేరింది. ఏఏఐబీ భారత గగనతలంలో జరిగే విమాన సంబంధిత భద్రతా సంఘటనలను వర్గీకరించి, ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై వివరణాత్మక దర్యాప్తు చేస్తుంది.

ఈ దర్యాప్తు ద్వారా ప్రమాదానికి గల కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు భద్రతా సిఫార్సులను అందిస్తుంది. ఈ దర్యాప్తులో ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్), కాక్‌‌‌‌పిట్ వాయిస్ రికార్డర్‌‌‌‌ను విశ్లేషించడం, ప్రమాద స్థలంలోని శిథిలాలను పరిశీలించడం, సాక్షులతో ఇంటర్వ్యూలు నిర్వహించడం వంటివి ఉంటాయి.