
- రూ. 115 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, వెలుగు: ఆఫీసర్స్ చాయిస్, జోయా బ్రాండ్ల పేరుతో ఆల్మహాల్అమ్మే దేశీయ స్పిరిట్స్ కంపెనీ ఆల్లాయిడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్ (ఏబీడీ), తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, రంగపూర్లో తన ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రంలో పెట్ బాటిల్ తయారీ యూనిట్ను ప్రారంభించింది. రూ. 115 కోట్లు పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 600 మిలియన్ బాటిళ్లు.
ఇది ఏబీడీ ప్యాకేజింగ్ అవసరాలను తీరుస్తుంది. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, లాభదాయకతను పెంచుతుంది. ఈ కేంద్రంలో ఈఎన్ఏ డిస్టిలరీ, ఐఎంఎఫ్ఎల్ బాట్లింగ్ యూనిట్, సింగిల్ మాల్ట్ ప్లాంట్ కూడా ఉన్నాయి. ఈ పెట్ యూనిట్కు అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీ ఉంది.
ఈ సందర్భంగా ఏబీడీ ఎండీ అలోక్ గుప్తా మాట్లాడుతూ, తమ రూ. 525 కోట్ల బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కార్యక్రమాలలో ఈ యూనిట్ ఒక భాగమని, దీని ద్వారా 2028 ఆర్థిక సంవత్సరం నాటికి గ్రాస్ మార్జిన్లు సుమారు 300 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని చెప్పారు. ‘‘భారతదేశం నుంచి మేం అతిపెద్ద ఆల్కహాల్ఎగుమతిదారులం. 2024 వరకు, మేం 17 దేశాలకు ఎగుమతి చేశాం. ఇప్పుడు 27 దేశాలకు పెంచాం. త్వరలో 35 దేశాలకు విస్తరిస్తాం”అని వివరించారు. ఏబీడీకి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,541 కోట్ల ఆదాయం వచ్చింది.