
హైదరాబాద్, వెలుగు: ఇక్సిగో గ్రూప్నకు చెందిన ఆన్లైన్ బస్-టికెటింగ్ ప్లాట్ఫారమ్ అయిన అభీబస్ఇటీవల ప్రవేశపెట్టిన అభీఅష్యూర్డ్ పథకాన్ని మరింత విస్తరించినట్టు ప్రకటించింది. ఈ పథకంలోకి మరింత మంది ఆపరేటర్లను తీసుకొచ్చింది. బస్సు బాగా లేకున్నా, రాకున్నా, సదుపాయాలు లేకున్నా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా ఈ పథకం కింద పరిహారం చెల్లిస్తారు. ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.తొమ్మిది వసూలు చేస్తారు. బస్సు ఆకస్మికంగా రద్దవడం, సీట్ల నాణ్యత బాగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ శర్మ అన్నారు. ‘‘బస్సు రెండు గంటలకు మించి లేటైతే పరిహారం పొందవచ్చు. రద్దయితే టికెట్ ధరకు రెండురెట్లు పరిహారం ఇస్తాం. ఈ పథకం కోసం 100 మంది ఆపరేటర్లను ఎంపిక చేశాం. వీరిలో 25 మంది ఏపీ, తెలంగాణ నుంచి ఉన్నారు. మేం మొత్తం 2,600 మంది ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నాం. వీరిలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ సహా పలు రాష్ట్రాల ఆర్టీసీలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో 500 మంది బస్ ఆపరేటర్లు ఉన్నారు. మేం గత ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించాం. ఈసారి దీనిని రూ.2,000 కోట్లకు పెంచాలని చూస్తున్నాం. మనదేశంలో ఇంటర్సిటీ బస్ మార్కెట్ సైజు 10 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. మాకు 20 శాతం మార్కెట్ వాటా ఉంది. అయితే ఇప్పటికీ 85 శాతం మంది ప్రయాణికులు కౌంటర్లలోనే టికెట్లు కొంటున్నారు. 25 శాతం మందే ఆన్లైన్లో కొంటున్నారు. మా ప్లాట్ఫారమ్ద్వారా ప్రయాణించే వారికి బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నాం. బ్రాండ్ అంబాసిడర్గా హీరో మహేశ్ బాబును కొనసాగిస్తాం”అని రోహిత్ వివరించారు.