అసెంబ్లీ, కౌన్సిల్ లో .. ఇయ్యాల క్వశ్చన్ అవర్ రద్దు

అసెంబ్లీ, కౌన్సిల్ లో .. ఇయ్యాల క్వశ్చన్ అవర్ రద్దు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్ లో ఆదివారం క్వశ్చన్ అవర్​ను రద్దు చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్​లో నేరుగా తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు. శనివారం అసెంబ్లీ ఆమోదించిన టిమ్స్, మైనార్టీ కమిషన్, ఫ్యాక్టరీస్ యాక్ట్ బిల్లులను ఆదివారం మండలిలో ప్రవేశపెట్టనున్నారు.