ఎల్బీనగర్, వెలుగు: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు శుక్రవారం దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మహేశ్మాట్లాడుతూ.. రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్లు రిలీజ్ చేయకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో స్టూడెంట్ లీడర్స్ హనుమాన్, వినయ్ పాల్గొన్నారు.