
హైదరాబాద్, వెలుగు: ఏసీబీ డీజీ విజయ్ కుమార్కు ప్రెసిడెంట్స్ మెడల్ దక్కింది. విజయ్ కుమార్తో పాటు డీజీపీ ఆఫీసులో అసిస్టెంట్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగారెడ్డి మాజీ ఎస్పీ ఎం. రమణకుమార్ సీఎం చేతుల మీదుగా ప్రెసిడెంట్స్ మెడల్ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పతకాలు అందించారు. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ గతంలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
ఇందుకు గాను ప్రెసిడెంట్స్ మెడల్ దక్కింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ ఆర్. భాస్కరన్ సహా 19 మందికి గ్యాలంట్రీ మెడల్స్ బహూకరించారు. వీరితో పాటు యూనిఫామ్ సర్విసెస్కు చెందిన మొత్తం 625 మంది శౌర్య పతకం, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన సేవ,సేవా పతకాలను అందుకున్నారు.