లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు

రంగారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. జిల్లాలోని కందుకూరు మండల పంచాయతీ సెక్రెటరీ నరేందర్ తో పాటు ఎంపిఓ కళ్యాణిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో సిమెంట్ బ్రిక్స్ యజమాని మధుసూదన్ రెడ్డికి హెచ్ఎండీఏ నుంచి అనుమతులు ఉన్న గ్రామ పంచాయతీ పర్మిషన్ కోసం పంచాయతీ సెక్రటరీ అధికారులు రూ. 5 లక్షలను డిమాండ్ చేయగా.. రూ. 2.5లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈరోజు(అక్టోబర్ 18) రాచులుర్ పంచాయతీ సెక్రెటరీ నరేందర్ డబ్బులు తీసుకుంటుండగా.. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే దీనికి సబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ అనంతరం వారిని అధికారులు కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు.