తహశీల్దార్ కార్యాలయంలో రెండోరోజు ఏసీబీ తనిఖీలు

తహశీల్దార్ కార్యాలయంలో రెండోరోజు ఏసీబీ తనిఖీలు

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోమవారం రైతు శ్రీనివాస్ నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఆర్ఐ శ్రీహరి ఏసీబీకి చిక్కాడు. వీఆర్ఏ సురేష్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్ఐ శ్రీహరి, వీఆర్ఏ సురేష్ బాబు ఇద్దరు కలిసి ఈ వ్యవహారం నడిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇద్దరి ఇంట్లో సోదాలు చేపట్టి.. కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు.