పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసుపై ఏసీబీ రైడ్స్ .. సిబ్బంది నుంచి రూ.60, 450 స్వాధీనం

పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసుపై  ఏసీబీ రైడ్స్ .. సిబ్బంది నుంచి రూ.60, 450 స్వాధీనం
  • ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మాత్తుగా సోదాలు చేశారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచి రూ. వేలల్లో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల  ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీల్లో  భాగంగా గురువారం ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్​ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసుపై రైడ్స్ చేశారు.   అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వద్ద రూ.60,450 లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  అనంతరం ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. 

ఉదయం నుంచి  రైడ్స్​ చేశామని నగదును పట్టుకున్నామని చెప్పారు.  ఆఫీసులో ఉన్న నగదు వివరాలను  ఉద్యోగులు చెప్పలేదని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.  ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.