
- ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడి
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మాత్తుగా సోదాలు చేశారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచి రూ. వేలల్లో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీల్లో భాగంగా గురువారం ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసుపై రైడ్స్ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వద్ద రూ.60,450 లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడారు.
ఉదయం నుంచి రైడ్స్ చేశామని నగదును పట్టుకున్నామని చెప్పారు. ఆఫీసులో ఉన్న నగదు వివరాలను ఉద్యోగులు చెప్పలేదని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.