మంచిర్యాల జిల్లా:ఏసీబీకి చిక్కిన లింగాయిపల్లి పంచాయతీ సెక్రటరీ..ఇంటి పర్మిషన్ కోసం డబ్బులు డిమాండ్

మంచిర్యాల జిల్లా:ఏసీబీకి చిక్కిన లింగాయిపల్లి పంచాయతీ సెక్రటరీ..ఇంటి పర్మిషన్ కోసం డబ్బులు డిమాండ్
  • కొత్త ఇంటికి నంబర్​కోసం రూ.20వేల డిమాండ్​
  • రూ.13వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

జన్నారం రూరల్, వెలుగు: ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు కొత్త ఇంటికి నంబర్​ కేటాయించేందుకు లంచం తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులకు శుక్రవారం పట్టుకున్నారు. ఆదిలాబాద్​ ఏసీబీ డీఎస్పీ మధు వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి గ్రామంలో జె.వరలక్ష్మి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

 గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో పర్మిషన్​, ఇంటి నంబర్​కేటాయించేందుకు గ్రామ కార్యదర్శిని సంప్రదించడంతో రూ.20వేలు డిమాండ్​ చేసింది. అంత ఇచ్చుకోలేని బాధితురాలు చెప్పడంతో రూ.13వేలకు ఒప్పందం కుదిరింది. 

నగదు రూపంలో కాకుండా ఫోన్​పే ద్వారా తాను సూచించిన మరో సెక్రటరీ లావణ్యకు పంపించాలని వరలక్ష్మి సూచించింది. ఈక్రమంలో బాధితురాలు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది. వరలక్ష్మి లంచం డిమాండ్​ చేయడం, అనంతరం ఫోన్​పే ద్వారా నగదు బదిలీ చేయాలని ఆదేశించడం వంటి విషయాలకు సంబంధించిన సాక్ష్యాలు శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లకు దొరకడంతో ఆమెను పట్టుకున్నారు.