ఆకునూరి మురళి రాజీనామా ఆమోదం

ఆకునూరి మురళి రాజీనామా ఆమోదం

హైదరాబాద్, వెలుగు: ఏపీ ఎడ్యుకేషన్ సలహాదారు పోస్టుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఏపీ ఎడ్యుకేషన్ స్పెషల్ సీఎస్ రాజశేఖర్ జీవో 191ని జారీ చేశారు. గత నెల 30న ఈ పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు మురళి ప్రకటించి, తన రాజీనామా ఆమోదించాలని ఏపీ సర్కార్‌‌‌‌‌‌‌‌కు లేఖ పంపించారు.

తెలంగాణలో హెల్త్, ఎడ్యుకేషన్ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, సొంత రాష్ట్రమైన తెలంగాణలో తన సేవలు అవసరం ఉన్నాయని అందుకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో మురళి పేర్కొన్నారు. కాగా, మురళి రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఆప్ లేదా బీఎస్పీలో చేరే అవకాశాలు కనపడుతున్నాయి.