
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా కిరండోల్ఎన్ఎండీసీ(నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఐరన్ గనిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. వాల్ నిర్మాణం కోసం గుట్టలను తవ్వుతున్న కూలీలపై పెద్ద పెద్ద మట్టి పెళ్లలు పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఆరుగురు మట్టి పెళ్లల కిందే చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గనిలో లార్సెన్ అండ్ టర్బో(ఎల్అండ్టీ) కంపెనీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ స్క్రీనింగ్ ప్లాంట్కు రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతున్నది. అందుకు గుట్టలను తవ్వుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్( స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆధ్వర్యంలో రెస్క్యూ జరుగుతున్నదని పేర్కొన్నారు.