ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, మినీ బస్ ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో 10 మంది గాయపడ్డారు. మొరాదాబాద్ హైవేపై కుందార్కీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో మినీ బస్సు తుక్కుతుక్కు అయింది. ప్రమాదంలో రెండు వాహనాలతో పాటు మరో వాహనం కూడా దెబ్బతింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఓవర్ టేకింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిని వారికి తగిన వైద్యం అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.
For More News..