యూపీలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి

యూపీలో ఘోర ప్రమాదం.. పది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, మినీ బస్ ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో 10 మంది గాయపడ్డారు. మొరాదాబాద్ హైవేపై కుందార్కీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో మినీ బస్సు తుక్కుతుక్కు అయింది. ప్రమాదంలో రెండు వాహనాలతో పాటు మరో వాహనం కూడా దెబ్బతింది.  సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఓవర్ టేకింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిని వారికి తగిన వైద్యం అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.

For More News..

లాడ్జీలో లవర్స్ సూసైడ్.. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులే

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. అయిదుగురికి తీవ్ర గాయాలు

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ