- మేడారంలో లారీలతో ప్రమాదాలు, ట్రాఫిక్జామ్
- రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ
- ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టని ఆఫీసర్లు
ములుగు, వెలుగు: మహా జాతర షురూ కాకముందే భక్తులంతా మేడారం బాట పట్టారు. నిత్యం వేలు, లక్షల సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే జాతరకు వచ్చే భక్తులను ఇసుక లారీలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లోని క్వారీల నుంచి ములుగు జిల్లా కేంద్రం మీదుగా వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి తదితర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఓవర్లోడ్తో ఉంటున్న ఇసుక లారీలు ఫుల్స్పీడ్తో వెళ్తున్నాయి. ఎదురుగా వచ్చే వెహికల్స్కు కనీసం ఇండికేషన్స్కూడా ఇవ్వడం లేదు. దీంతో జాతరకొచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
వరుస ప్రమాదాలతో ఆందోళన
మేడారం మహాజాతర ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనుంది. ఇప్పటికే భక్తులు భారీగా తరలి వస్తుండడంతో రోడ్లపై వెహికల్స్రద్దీ పెరిగింది. ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్జామ్సమస్య మరింత ఎక్కువవుతోంది. చాలామంది ఇసుక లారీల డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతూ ఇతర వెహికల్స్ను ఓవర్టేక్చేస్తున్నారు. మూల మలుపుల వద్ద కూడా ఫుల్స్పీడ్తో వెళుతుండడంతో అంతా భయాందోళన చెందుతున్నారు. వెంటనే ఇసుక లారీలను బంద్ చేయాలని ములుగు జిల్లా ప్రజలతోపాటు భక్తులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్దృష్టికి కూడా పలువురు ఈ విషయాన్ని తీసుకెళ్లగా టీఎస్ఎండీసీ ఆఫీసర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ములుగు-– పస్రా, పస్రా – తాడ్వాయి, తాడ్వాయి – ఏటూరునాగారం రూట్లతోపాటు ములుగు – వరంగల్రూట్లో ఇసుక లారీలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలో ఇసుక లారీలతో జరిగిన ప్రమాదాల్లో ఇటీవల నలుగురు చనిపోయారు. డిసెంబర్లో చల్వాయి, గోవిందరావుపేట గ్రామాల మధ్య రోడ్డుపై ఆపిన ఇసుక లారీని వ్యాన్ఢీకొనడంతో మణుగూరు ప్రాంతానికి చెందిన మిర్చి రైతులు ఇద్దరు చనిపోయారు. రాఘవపట్నం వద్ద బైక్ను ఇసుక లారీ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. శుక్రవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని మసీదు సెంటర్వద్ద రోడ్డు దాటుతున్న శ్రీనివాస్అనే స్థానికుడిని ఇసుక లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. శనివారం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద నెక్కొండకు చెందిన ఓ కుటుంబం ఆటోలో ఏటూరునాగారం నుంచి సొంతూరుకు వెళ్తుండగా వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల పస్రా – తాడ్వాయి మధ్య నేషనల్హైవేపై ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
లారీలను కట్టడి చేయాలి
మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. లారీలు ఇష్టం వచ్చినట్లు వెళుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే కలెక్టర్ప్రత్యేక చొరవ తీసుకొని లారీలను నియంత్రించాలి. లేదంటే డైవర్ట్ చేయాలి. - సీతక్క, ఎమ్మెల్యే, ములుగు