పోలీస్​ కస్టడీలోని నిందితుడు పరార్

పోలీస్​ కస్టడీలోని నిందితుడు పరార్

నిజామాబాద్, వెలుగు: డిచ్​పల్లి పోలీసుల కస్టడీలోని నిందితుడు మంగళవారం ఉదయం పారిపోయాడు. బాత్రూం కిటికీ రాడ్​ను పక్కకు వంచి  జారుకున్నాడు. బయట కాపలా ఉన్న కానిస్టేబుల్​గమనించేలోపు పారిపోయాడు. ఈ నెల 4న నిజామాబాద్​రూరల్​సెగ్మెంట్​జక్రాన్​పల్లి మండల కేంద్రంలో చైన్ స్నాచింగ్​జరిగింది. బీడీలు చుట్టే స్వర్ణ అనే మహిళ వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు అడ్రస్ అడుగుతూ ఆమె మెడలోని గోల్డ్ చైన్​ను లాక్కెళ్లారు. 

ఇందిరమ్మ కాలనీలోని మరో మహిళ వద్ద ఇలాగే లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మహ్మద్​సోహెల్, ఇమ్రాన్​అనే ఇద్దరు చైన్​స్నాచింగ్​కు పాల్పడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని డిచ్​పల్లి పీఎస్​కు తరలించారు. అయితే నిందితుల్లో ఒకరైన మహ్మద్ సోహెల్​మంగళవారం బాత్రూమ్​కిటికీ రాడ్​వంచి పరారయ్యాడు. స్టేషన్​కు కంపౌండ్​ వాల్ లేకపోవడంతో ఫెన్సింగ్​కిందగా జారుకున్నాడు. సీపీ కల్మేశ్వర్ ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఏసీపీ కిరణ్​కుమార్ స్టేషన్​ను  విజిట్​చేశారు. స్పెషల్ టీమ్​ను రంగంలోకి దింపారు.