విద్యార్థులే టార్గెట్గా గంజాయి అమ్ముతున్న నిందితులు అరెస్ట్

విద్యార్థులే టార్గెట్గా గంజాయి అమ్ముతున్న నిందితులు అరెస్ట్

యువకులు, విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్ముతున్న నిందితులను బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో భాగంగా ఇద్దరు నిందితుల నుంచి రూ. 45 వేల విలువగల 3 గ్రాముల MDMA డ్రగ్స్, గంజాయిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 3 సెల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
 నిన్న(ఫిబ్రవరి 21) రాత్రి SOT కి అందిన సమాచారం ప్రకారం.. సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్ బాలానగర్ పోలీసులతో కలిసి ఐడీపీల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.