నయనతారకు అవమానం.. ఆ సంఘటన గుర్తుచేసిన పార్థిపన్

నయనతారకు అవమానం.. ఆ సంఘటన గుర్తుచేసిన పార్థిపన్

తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్​ స్టార్​గా వెలుగుతోంది నయనతార. కానీ, ఈ స్టేటస్​ ఆమెకు అంత తేలికగా రాలేదు. కెరీర్​ ఆరంభంలో ఎన్నో అవమానాలను, ఛీత్కారాలను నయన్​ ఎదుర్కొంది. తాజాగా తమిళ దర్శకుడు పార్థిపన్​ ఈ హీరోయిన్​తో తన తొలి సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు. ‘నయన తార ఫొటోలు చూసి నేను తీస్తున్న మళై అనే సినిమా కోసం ఆమెకు ఫోన్​ చేసి రమ్మన్నాను. ఆరోజు రాకుండా మరుసటి రోజు ఫోన్​ చేసింది. నిన్న రాలేకపోయాను బస్సు ఎక్కి రేపు ఉదయంకల్లా వస్తాను అని చెప్పింది. నాకొచ్చిన కోపానికి నువ్వింక రావద్దు అని చెప్పి ఫోన్​ పెట్టేశాను. 

ఆరోజు కేరళ నుంచి బస్సులో వస్తానన్న అమ్మాయి ఇప్పుడు తమిళ స్టార్​ హీరోయిన్​ గా ఎదగడం ఎంతో గొప్ప విషయం’ అంటూ తెలిపాడు. ఈ అవకాశం మిస్సైనా ‘అయ్యా’ అనే సినిమాతో నయన్​ కోలీవుడ్​కి పరిచయమైంది. తర్వాత రజనీకాంత్​తో చంద్రముఖిలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.