హైదరాబాద్ మెట్రో ఎక్కిన వకీల్‌సాబ్..

హైదరాబాద్ మెట్రో ఎక్కిన వకీల్‌సాబ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఈ రోజు పవన్ కళ్యాణ్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైళ్లో ప్రయాణించారు. ఆయన వెంట దిల్ రాజు కూడా ఉన్నారు. ట్రైన్‌లో తోటి ప్రయాణకులతో పవన్ ముచ్చటించారు.

వకీల్ సాబ్ సినిమాలో అంజలీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో అమితాబ్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతమందిస్తున్నారు.

For More News..

వీడియో: ‘ఆంటీ’ అన్నందుకు 19 ఏళ్ల యువతిని చితకబాదిన 40 ఏళ్ల మహిళ

దేశంలో కొత్తగా 50,209 కరోనా కేసులు

పాపికొండల టూర్‌కు గ్రీన్​ సిగ్నల్‍