కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో రాహుల్ జోడో యాత్రలో బాలీవుడ్ నటి రియా సేన్ పాల్గొన్నారు. కొద్దిసేపు రాహుల్తో కలిసి నడిచారు. అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ వారిలో జోష్ నింపారు. అంతకుముందు తెలంగాణలో సాగిన రాహుల్ పాదయాత్రలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు. హైదరాబాద్లో రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజా భట్ పాల్గొన్నారు. తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా జోడో యాత్రలో పాల్గొన్నారు.
దేశ ప్రజలను ఏకం చేసేందుకే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక.. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలు తెలుసుకుని హామీలు ఇస్తున్నారు.