నటి రాధిక, శరత్ కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష

నటి రాధిక, శరత్ కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష

చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ న‌టి రాధిక‌తో పాటు ఆమె భ‌ర్త  శరత్ కుమార్‌కు చెన్నై కోర్టు సంవత్సర కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కొన్ని ఏళ్లుగా వారు కోర్టు చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు. ఇవాళ(బుధవారం) ఈ కేసులో వాద‌న‌లు ముగియ‌డంతో కోర్టు తీర్పునిచ్చింది.

2015లో  ఇదు ఎన్న మాయం మూవీ కోసం వారిద్ద‌రు రేడియంట్‌ గ్రూప్‌ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని.. సకాలంలో తిరిగి చెల్లించ‌లేదు. కొద్ది రోజుల తర్వాత వారు చెక్ ఇచ్చారు. అయితే  ఆ చెక్ బౌన్స్‌ అయింది. దీంతో వారికి అప్పు ఇచ్చిన రేడియంట్ గ్రూప్‌ 2018లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత చెన్నై స్పెషల్‌ కోర్టు  బుధవారం వారికి శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ తీర్పు ఇచ్చింది.