
కెరీర్ ప్రారంభించాక తొలి ఐదేళ్లలోనే ఇరవైకి పైగా చిత్రాల్లో నటించింది మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి.‘గాడ్సే’ సినిమాతో ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 17న విడుదలవుతున్న సందర్భంగా కాసేపు ఇలా కబుర్లు చెప్పింది.
‘‘ఇంత మంచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది.ప్రభుత్వానికి సంబంధించిన చాలా విషయాలపై ఇందులో చర్చించారు.డైలాగ్స్, ఎమోషన్స్తోనే సినిమా అంతా సాగుతుంది.వ్యవస్థను ప్రశ్నించే బాధ్యత ఉన్న క్యారెక్టర్లో సత్యదేవ్ నటించారు.ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వైశాలి పాత్రలో నేను కనిపిస్తాను.మా ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య మంచి ట్విస్ట్ ఉంటుంది.సినిమా చేస్తున్నప్పుడు న్యూస్ బాగా ఫాలో అయ్యేదాన్ని.సమాజంలో జరిగే వాటిపై నాలెడ్జ్ పెంచుకునేదాన్ని.నా పాత్ర కోసం నా చుట్టూ జరిగేవన్నీ తెలుసుకోవాలనుకున్నాను.సత్యదేవ్ అమేజింగ్ యాక్టర్.ఆయన నటించిన జ్యోతిలక్ష్మి, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి కొన్ని సినిమాలు చూశాను.ప్రతి సినిమాకీ వేరియేషన్స్ చూపిస్తారాయన.తనని చూస్తే ఫహాద్ ఫాజిల్ గుర్తొచ్చారు.సత్య డైలాగ్ డెలివరీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది.
మంచితనం,నిజాయతీ గల వ్యక్తి.తన దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాను.దీంతో పాటు తెలుగులో ‘అమ్ము’ షూటింగ్ కూడా పూర్తి చేశాను.త్వరలోనే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది.అలాగే కొన్ని తమిళ, మలయాళ చిత్రాలు లైన్లో ఉన్నాయి.వీటిలో మణిరత్నం గారి ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి.సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది.వచ్చే నెలలో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తారు. మణిరత్నం నాకు దేవుడి లాంటివారు.అందుకే ఆయన సినిమాలో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకు విజయశాంతిలా ఇంటెన్స్, యాక్షన్ రోల్స్ చేయాలనుంది.నెగిటివ్ రోల్స్ మాత్రం ఇప్పట్లో చేయను.’’