సౌత్​ హీరోలంటే నో అంటోంది

సౌత్​ హీరోలంటే నో అంటోంది

బాలీవుడ్​ వివాదాస్పద నటిగా పేరున్న కంగనా రనౌత్​ ఏం చేసినా అది హాట్​ టాపిక్​గానే మారుతోంది. ఈ బోల్డ్​ బ్యూటీ చుట్టూ తాజాగా కొత్త వివాదం నడుస్తోంది. సౌత్​ సినిమాలను కంగనా చిన్న చూపు చూస్తోందని కొందరు ఆమెపై మండిపడుతున్నారు. ఇటీవల కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​ సినిమాకు ఈ హీరోయిన్​ నో చెప్పడమే ఇందుకు కారణం. 

ధనుష్​ 50వ సినిమా కావడంతో సన్​ పిక్చర్స్​ భారీ స్థాయిలో దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్​ క్వీన్​ క్యాల్షీట్లు లేవంటూ నో చెప్పిందట. దీంతో త్రిషను కన్ఫర్మ్​ చేశారు. అంతకుముందు శింబుకు జోడీగా నటించేందుకు కూడా కంగనా ఇలాంటి కారణమే చెప్పి తప్పించుకుంది. దీంతో ఈ నటి కావాలనే సౌత్​ సినిమాలను దూరం పెడుతుందనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై ఈ బాలీవుడ్​ క్వీన్​ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.