సిల్క్ స్మిత బయోపిక్ లో నటి శ్రీరెడ్డి

సిల్క్ స్మిత బయోపిక్ లో నటి శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దివంగత నటి సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా నిర్మితమవుతున్న బయోపిక్‌లో శ్రీరెడ్డి లీడ్‌ రోల్‌ పోషించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. అంతేకాదు..సిల్క్‌ స్మితతో తనను తాను పోల్చకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది.
అయితే ఇప్పటికే సిల్క్‌ స్మిత బయోపిక్‌లో యంకర్‌ అనసూయ నటించనున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ పుకార్లకు చెక్ పెట్టింది అన‌సూయ. సిల్క్ స్మిత బ‌యోపిక్‌లో న‌టించ‌డం లేద‌ని స్పష్టం చేసింది.

బాలీవుడ్‌లో 2011లో సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా డర్టీ పిక్చర్‌ పేరుతో విడుదలైన బయోపిక్‌లో నటి విద్యాబాలన్‌ నటించింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి గానూ జాతీయ అవార్డును దక్కించుకుంది.