ఎమ్మెల్యే పాయల్ శంకర్‎పై అభిమానం.. తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించిన అడా గ్రామస్తులు

 ఎమ్మెల్యే పాయల్ శంకర్‎పై అభిమానం.. తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించిన అడా గ్రామస్తులు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిచినందుకు అతని సొంతూరికి చెందిన  గ్రామస్తులు  మొక్కు చెల్లించున్నారు.  గతంలో శంకర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా.. నాలుగోసారి గెలిస్తే తలనీలాలు ఇస్తామని జైనథ్ ​మండలం అడా గ్రామస్తులు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కారు.  

ఎమ్మెల్యేగా శంకర్ గెలవడంతో గ్రామానికి చెందిన150 మంది తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం ఎమ్మెల్యే  శంకర్​ను హైదరాబాద్​లోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో  కలిశారు.  తన గెలుపులో అడా గ్రామ ప్రజల పాత్ర ఎంతో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన జీవితకాలం గ్రామస్తులకు, ఆదిలాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు.  శంకర్​ సర్పంచ్​ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారని గ్రామస్తులు పేర్కొన్నారు.