
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఆన్లైన్ రైలు టిక్కెట్ బుకింగ్ ప్లాట్ఫారమ్ ట్రైన్మ్యాన్ను నిర్వహించే స్టార్ట్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్లో(ఎస్ఈపీఎల్) దాదాపు 30 శాతం వాటాను కొన్నది. అదానీ ఎంటర్ప్రైజెస్ గత నెలలో ఎస్ఈపీఎల్లో 100 శాతం వాటా కొనేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించింది. అయితే శనివారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి చెందిన అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఈపీఎల్ లో 29.81 శాతం వాటాను రూ.3.56 కోట్లకు కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ఎస్ఈపీఎల్ 2022–-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.51 కోట్ల టర్నోవర్ సాధించింది.
ట్రైన్మ్యాన్తో పాటు రైల్వేస్ టికెటింగ్ విభాగం అయిన ఐఆర్సీటీసీను కూడా అదానీ టేకోవర్ చేయొచ్చంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గత నెల విమర్శించారు. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది. మొత్తం ఈ–టికెట్లలో 81 శాతం తమ ప్లాట్ఫామ్ నుంచే బుక్ అవుతున్నాయని, ట్రైన్మ్యాన్తమకు పోటీ కాదని తెలిపింది. ఐఆర్సీటీసీకి బీ2సీ పార్ట్నర్ అయిన ట్రైన్మ్యాన్కు మొత్తం రిజర్వ్డ్ టికెటింగ్లో 0.13 శాతం వరకు వాటా ఉంది. 2011లో వినీత్ చిరానియా, కరణ్ కుమార్ స్థాపించిన ట్రైన్మ్యాన్ జజ ట్రావెల్ బుకింగ్ యాప్. దీనిద్వారా ప్రయాణీకులు పీఎన్ఆర్ (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. వెయిట్-లిస్టులో ఉంటే సీటును పొందే అవకాశాన్ని తెలుసుకోవచ్చు. సీటు లభ్యత, ట్రైన్ స్టేట్, టైమ్ టేబుల్, కోచ్ పొజిషన్, ఛార్జీల కాలిక్యులేటర్ మొదలైన సేవలను అందిస్తుంది. ట్రావెల్ బుకింగ్ ఇన్ఫర్మేషన్ విభాగంలో అదానీ గ్రూప్కు ఇది రెండవ పెట్టుబడి. 2021 అక్టోబర్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ క్లియర్ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.