
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ.వెయ్యి కోట్ల బాండ్ ఇష్యూ బుధవారం ప్రారంభమైన మూడు గంటలలోపే పూర్తిగా సబ్స్క్రయిబ్ అయింది. కంపెనీ నాన్–-కన్వర్టిబుల్ డిబెంచర్ (ఎన్సీడీలు) ఇష్యూ బుధవారం (జులై 09) ప్రారంభమైంది.
ఇది ఈనెల 22న ముగియాల్సి ఉంది. పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినందుకు ముందస్తుగా ముగిసే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. వీటికి ఏటా 9.3 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. మొదటి రోజే ఇష్యూకు రూ. 1,400 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి.
ఈ ఆఫర్ ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన జరిగింది రిటైల్ పెట్టుబడిదారులు, సంపన్నులు, కార్పొరేట్ల నుంచి బలమైన రెస్పాన్స్ వచ్చింది.