యూఎస్ దర్యాప్తుతో మాకు సంబంధం లేదు : అదానీ గ్రూప్​

యూఎస్ దర్యాప్తుతో మాకు సంబంధం లేదు : అదానీ గ్రూప్​

న్యూఢిల్లీ:  లంచం ఆరోపణల గురించి దర్యాప్తుపై యూఎస్​ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని  అదానీ గ్రూప్ కంపెనీలు తెలిపాయి.  అయితే ఒక థర్డ్​పార్టీ అమెరికన్ అవినీతి నిరోధక చట్టాల ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తమకు తెలుసని అదానీ గ్రీన్ ఎనర్జీ  పేర్కొంది.  

యూఎస్​ ప్రాసిక్యూటర్లు అదానీ గ్రూప్‌‌‌‌పై తమ దర్యాప్తును విస్తృతం చేశారన్న మీడియా రిపోర్టులపై అదానీ గ్రూపు స్పందించింది.  సంబంధిత థర్డ్​పార్టీతో తమకు సంబంధాలు లేవని తెలిపింది.  లిస్టెడ్ అదానీ కంపెనీలు -- అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ విల్మార్ లిమిటెడ్,  ఎన్​డీ టీవీలు యూఎస్​ అధికారుల నుంచి తమకు ఎటువంటి నోటీసులు అందలేదని వేర్వేరు ఫైలింగ్‌‌‌‌లలో పేర్కొన్నాయి. భారత్​లో ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం లంచం ఆరోపణలపై అమెరికాలో దర్యాప్తు జరుగుతున్నట్టు బ్లూమ్​బర్గ్​వార్తాసంస్థ తెలిపింది.