
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్లో కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలను పెంచుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 21 – సెప్టెంబర్ 7 మధ్య ప్రమోటర్లు తమ వాటాను 2.06 శాతం పెంచుకొన్నారని, దీంతో వీరి మొత్తం వాటా 71.93 శాతానికి చేరుకుందని అదానీ ఎంటర్ప్రైజెస్ ఎక్స్చేంజి ఫైలింగ్లో పేర్కొంది. 0.61 శాతం వాటాను కెంపస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆగస్టు 21, 22 న కొనుగోలు చేసింది. 1.46 శాతం వాటాను ఇన్ఫినిటీ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆగస్టు 30–సెప్టెంబర్ 7 మధ్య కొన్నది. ఈ రెండు కంపెనీలు కూడా అదానీ ఎంటర్ప్రైజెస్లో ప్రమోటర్లు.
కాగా, ఇండియన్ మార్కెట్ రూల్స్ ప్రకారం, కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. శుక్రవారం క్లోజింగ్ ప్రైసెస్ దగ్గర అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ రూ.11 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్స్కు అదానీ గ్రూప్ పాల్పడిందని ఈ ఏడాది జనవరిలో హిండెన్ బర్గ్ రిపోర్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అదానీ కంపెనీల షేర్లు 70 శాతం వరకు క్రాష్ అయ్యాయి.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ నష్టాల నుంచి రికవరీ అవుతున్న టైమ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) రిపోర్ట్ విడుదల చేసింది. స్టాక్ మానిప్యులేషన్కు గ్రూప్ పాల్పడిందని ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలషేర్లు మళ్లీ భారీగా పడ్డాయి. తాజాగా ఈ నష్టాల నుంచి రికవరీ అవుతున్నాయి.