అదానీ విల్మార్ లిమిటెడ్లో మొత్తం వాటా అమ్మిన అదానీ

అదానీ విల్మార్ లిమిటెడ్లో మొత్తం వాటా అమ్మిన అదానీ

న్యూఢిల్లీ: అదానీ విల్మార్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో (ఏడబ్ల్యూఎల్) మిగిలిన ఏడు శాతం వాటాను అదానీ గ్రూప్ బ్లాక్ డీల్ ద్వారా అమ్మింది. షేర్లను వ్యాన్​గార్డ్, చార్లెస్ షాబ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్​, ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్, టాటా ఎంఎఫ్​, క్వాంట్ ఎంఎఫ్, బంధన్ ఎంఎఫ్​ వంటి దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొన్నాయి. 

సింగపూర్, యూఏఈ, ఇతర ఆసియా మార్కెట్ల నుంచి పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా  వాటాలను కొనుగోలు చేశారు. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్​ తన 44 శాతం వాటాను పూర్తిగా విక్రయించగా, సింగపూర్ ఆధారిత విల్మార్ ఇంటర్నేషనల్ ఇప్పుడు దాదాపు 57 శాతం వాటాతో ఏడబ్ల్యూఎల్​కు ఏకైక ప్రమోటర్‌‌‌‌‌‌‌‌గా మారింది.  ఫార్చ్యూన్  పేరుతో ఇది వంటనూనెలు అమ్ముతుంది.