బహిరంగ వ్యాఖ్యలు చేసిన సీనియర్లకు షోకాజ్ నోటీసులివ్వాలి: అద్దంకి దయాకర్

బహిరంగ వ్యాఖ్యలు చేసిన సీనియర్లకు షోకాజ్ నోటీసులివ్వాలి: అద్దంకి దయాకర్

తెలంగాణ కాంగ్రెస్‭లో సీనియర్లు చేస్తున్నది పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని మాజీ మంత్రి అద్దంకి దయాకర్ అన్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాను బహిరంగంగా మాట్లాడినప్పుడు పార్టీ క్రమశిక్షణ రాహిత్యం అంటూ నోటీసులు ఇచ్చారని.. ఇప్పుడు మాట్లాడిన వారికి నోటీసులు ఇవ్వరా అని అద్దంకి మండిపడ్డారు. వాళ్లకు ఏమైనా కాంగ్రెస్ రాజ్యాంగం కొత్తగా ఉందా అని ఆరోపించారు. 

వలస పార్టీ అని ఐదారుగురు నిర్ణయిస్తారా? అని అద్దంకి దయాకర్ అన్నారు. తమకు రాజకీయ నేపథ్యం లేకున్నా పార్టీ కోసం పనిచేయడానికి వచ్చామన్నారు. పంచాయతీలు పెట్టుకునేందుకు ఇక్కడికి రాలేదని చెప్పారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసి తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని సీనియర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పంచాయితీని బయట పెడితే నష్టపోతారని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీపైన లేని కోపం తెలంగాణ కాంగ్రెస్ పై ఎందుకని ప్రశ్నించారు. అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శించాలని అద్దంకి దయాకర్ నిలదీశారు.