ఆన్​-లైన్‌‌ గేమ్స్​కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

ఆన్​-లైన్‌‌ గేమ్స్​కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

అశ్వారావుపేట వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో ఆన్‌‌లైన్‌‌ గేమ్స్​కు బానిసైన ఓ స్టూడెంట్ తల్లి మందలించడంతో ​బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం...అశ్వారావుపేట పట్టణానికి  చెందిన భానుప్రియ కొడుకు అక్షయ్ (15) 10వ తరగతి చదువుతున్నాడు. అక్షయ్ కొద్ది రోజులుగా ఆన్‌‌లైన్ గేమ్స్​కు బానిసయ్యాడు. ఈ కారణంతో చదువులో వెనుకబడడంతో తల్లి మందలించింది.

ఇంకోసారి గేమ్స్​ ఆడొద్దని, చదువుపై దృష్టి పెట్టాలని వార్నింగ్​ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన అతడు బుధవారం తెల్లవారుజామున గదిలో చున్నీతో ఫ్యాన్​కు ఉరి వేసుకున్నాడు. ఉదయం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యాన్​కు  వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో కిందకు దించి చూడగా అప్పటికే ప్రాణాలు పోయాయి. పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.