V6 News

ఫెసిలిటేషన్ సెంటర్ పరిశీలన

ఫెసిలిటేషన్ సెంటర్ పరిశీలన

జనగామ అర్బన్, వెలుగు: జనగామ ఎంపీడీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన పోస్టల్​బ్యాలెట్​ ఫెసిలిటేషన్ సెంటర్​ను అడిషనల్​ కలెక్టర్ పింకేశ్​కుమార్ శుక్రవారం పరిశీలించారు. పోస్టల్​ బ్యాలెట్​, ధ్రువీకరణ ప్రక్రియ, బ్యాలెట్​ బాక్సుల భద్రత, రికార్డు నిర్వహణ, సిబ్బంది సమన్వయం, సీసీటీవీ పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై ఆయన సమీక్షించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం, నియమావళి అమలు ముఖ్యమని అధికారులకు సూచించారు. పోస్టల్​ బ్యాలెట్​ ఓటింగ్​పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అంతరాయం లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులంతా అప్రమత్తంగా బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.